కరోనాకు చిక్కుతున్న అగ్ర తారలు
- విదేశీ ప్రయాణాలే కారణం
సినీపరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. టాలీవుడ్ , బాలీవుడ్ , కొలీవుడ్ లో పలువురు అగ్ర నటీనటులు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు సత్యరాజ్కు కొవిడ్ సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అంతకుముందు తమిళ చిత్రసీమలో కమెడియన్ వడివేలు, చియాన్ విక్రమ్, వరలక్ష్మీ, అర్జున్, కమల్హాసన్, త్రిష, అరుణ్ విజయ్ , మీనా తదితరులు కరోనా బారిన పడగా.. టాలీవుడ్లో మహేశ్బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, తమన్ , విశ్వక్ సేన్ వైరస్ బారిన పడ్డారు. వరుసగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కరోనా కేసులు బయటపడుతుండటంతో డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ లు వాయిదా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఫస్ట్ వేవ్ , సెకండ్ వేవ్ ల కన్నా చిత్ర పరిశ్రమకు ఈ మూడో వేవ్ మరింత నష్టాన్ని తీసుకొచ్చేలా కనిపిస్తుంది.
Post a Comment