పవన్ కళ్యాణ్, బాలకృష్ణను ప్రభుత్వం టార్గెట్ చేసిందనుకోవడం లేదు

 


సినిమా టికెట్ ధరల తగ్గింపు వల్ల సినీ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ విషయంపై సోమవారం ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి పేర్ని నానితో సమావేశయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పేర్నినానితో చర్చలు చాలా సంతృప్తికరంగా ముగిశాయని ఆర్జీవీ తెలిపారు. మంత్రితో సమావేశం ముగిసిన తర్వాత ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ....

" మంత్రి పేర్ని నానితో జరిగిన సమావేశంలో ఐదు అంశాలంపై ప్రధానంగా చర్చించాం. టికెట్ ధరలు తగ్గించడాన్ని వ్యతిరేకించా. ఫిల్మ్ ఇండస్ట్రీతో నాకున్న 30 ఏళ్ల అనుభవంతో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లా. ఆయన కూడా నాకు కొన్ని విషయాలు చెప్పారు. వాటిని సినీ రంగానికి చెందిన పెద్దలతో కలిసి చర్చిస్తా. ఇదొక పద్దతి ప్రకారం చేస్తాం. అందరికి ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నా. టికెట్ రేట్లు తగ్గిస్తే ఇండస్ట్రీకి నష్టం వస్తుందని మంత్రికి వివరించా. ఒక డైరెక్టర్ గా నా అభిప్రాయాలను మాత్రమే పంచుకున్నా. నేను ఎలాంటి డిమాండ్ల చేయలేదు. తుది నిర్ణయం అనేది ప్రభుత్వమే తీసుకుంటుంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించిందనే వాదనతో నేను ఏకీభవించను. అయితే ప్రభుత్వం నిర్ణయం స్టార్ అందరిపైనా, అన్ని సినిమాలపైనా ప్రభావం చూపుతుంది. కేవలం పవన్ కల్యాణ్, బాలకృష్ణను టార్గెట్ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. టికెట్ ధరల తగ్గింపు విషయంలో నేను అడిగిన ప్రశ్నలకు వివరంగా ఉదాహారణలు చెప్పి వివరించా. కేవలం ఈ ఒక్క మీటింగ్ తోనే టికెట్ ధరలు తగ్గింపు అంశం ముగిసిపోదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే నేను ఒక్కడినే కాదు. వందల మంది ఉన్నారు. వాళ్లందరి అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఇండస్ట్రీ తరపున రాలేదు. కేవలం ఒక డైరెక్టర్ గా, నిర్మాతగా మాత్రమే వచ్చా. ఎవరైతే సినిమా తీస్తారో వాళ్లే టికెట్ ధర నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలి. సమస్య పరిష్కారం అనేది సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం ఇద్దరిపైనా ఉంది. తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతపై ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు" 


Post a Comment

Previous Post Next Post